Israel | ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం (Israel – Hamas War) ఆరునెలలుగా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరువైపులా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్ అతలాకుతలమవుతోంది. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఉండేందుకు ఇల్లు, తినేందుకు ఆహారం, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నారు. ఇక హమాస్తో ఘర్షణల వల్ల ఇజ్రాయెల్ నిర్మాణ రంగం కుదేలైంది. ప్రస్తుతం ఈ రంగంలో కార్మికుల కొరత తీవ్రమైంది (labour shortage). యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్లో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి.
ఇప్పటి వరకూ పాలస్తీనా ఆధీనంలోని వెస్ట్ బ్యాంక్ నుంచి 80 వేల మంది, గాజాకు చెందిన 17 వేల మంది అక్కడ పనిచేస్తుండేవారు. కానీ , తాజా ఘర్షణల నేపథ్యంలో వారికి పని అనుమతిని ఇజ్రాయెల్ రద్దు చేసింది. దీంతో కార్మికుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వారి స్థానాల్లో ఇజ్రాయెల్ విదేశాల నుంచి కార్మికులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా భారత్ నుంచి 6,000 మంది శ్రామికులు అక్కడికి వెళ్లనున్నారు (Indian Construction Workers). ఏప్రిల్, మే నెలల్లో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వీరందరినీ తరలించనున్నారు. ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ, నిర్మాణ శాఖ సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం రాత్రి ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
Also Read..
Kashi Vishwanath Temple | కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులకు సంప్రదాయ యూనిఫాం
School Bus | చెట్టును ఢీ కొట్టి బోల్తాపడిన పాఠశాల బస్సు.. ఆరుగురు విద్యార్థులు మృతి
Ramadan | దేశవ్యాప్తంగా రంజాన్ ప్రార్థనలు.. ఈద్గాల వద్ద సందడి