టెక్సాస్: జన్యుచికిత్సలో అమెరికా పరిశోధకులు పురోగతి సాధించారు. బేలర్ మెడిసిన్ కాలేజీ పరిశోధకులు జన్యు వ్యక్తీకరణను నియంత్రించే అధునాతన సాంకేతికతను రూపొందించారు. జన్యుచికిత్సలో జన్యువులు ఎక్కువ లేదా తక్కువ ఉండటం ఇప్పటివరకూ సమస్యాత్మకంగా మారింది.
అయితే, పరిశోధకులు టెట్రాసైక్లిన్ అనే డ్రగ్ను ఉపయోగించి జన్యువులను నియంత్రిస్తూ ప్రొటీన్ ఉత్పత్తిని డీఫాల్ట్గా ఆగిపోయేలా చేశారు. ఈ విధానంలో అదనపు పాలి ఏ సిగ్నల్తో కూడిన ఆర్ఎన్ఏ ఉంటుంది. దీంతో లైట్ స్విచ్ఛ్ ఆఫ్, ఆన్ మాదిరిగా జన్యువులను కూడా ఎప్పుడంటే అప్పుడు నియంత్రించ వచ్చని పరిశోధకులు తెలిపారు.