లండన్: అమెరికా, బ్రిటన్ మధ్య ఉన్న బలమైన బంధానికి సూచికగా రెండు దేశాల అధినేతలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జీ7 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 6 వేల డాలర్ల (సుమారు 4.4 లక్షలు) విలువైన సైకిల్ను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు బహుమతిగా ఇచ్చారు. మెషీన్ వాడకుండా ఇది చేత్తో చేసిన సైకిల్ కావడం విశేషం. మరోవైపు బ్రిటన్ ప్రధాని జాన్సన్.. 19వ శతాబ్దంలో బానిసత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వ్యక్తి ఫొటోను బైడెన్కు ఇచ్చారు.
జాన్సన్కు బైడెన్ ఇచ్చిన సైకిల్ బ్రిటన్ జెండాలో ఉండే బ్లూ, రెడ్ కలర్స్లో ఉంది. దీనిపై ఇద్దరు దేశాధినేతలు సంతకాలు కూడా చేశారు. అటు బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఫ్రెడ్రిక్ డగ్లస్ ఫొటోను ఫ్రేమ్ కట్టించి బైడెన్కు ఇచ్చారు జాన్సన్. డగ్లస్ గురించి వికీపీడియాలో తెలుసుకొని ఈ ఫొటో ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం.