Joe Biden | ప్రపంచంలోని చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం నిత్యం పెరుగుతూ వెళ్తున్నది. సవాల్ విసురుతోన్న ద్రవ్యోల్బణంపై దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో మాంద్యంపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంలో మాంద్యం రాబోదన్నారు. ‘నా దృష్టిలో మే ప్రస్తుతం మాంద్యంలోకి వెళ్లడం లేదు. అమెరికాలో నిరుద్యోగ రేటు ఇప్పటికీ చరిత్రలో అత్యల్పంగా ఉంది. ఇది కేవలం 3.6శాతంలోనే ఉన్నది. ఈ వేగవంతమైన వృద్ధి నుంచి స్తబ్దత ఉన్న వృద్ధికి మనం వెళుతున్నప్పుడు.. మన ఆర్థిక వ్యవస్థ కొంచెం తిరోగమనాన్ని చూస్తుందని నా ఆశ. ఇది దేవుని చిత్తం, మనం మాంద్యం చూడబోతున్నామని నేను అనుకోను’ అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు భారత్పై సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ మినహా చాలా పెద్ద దేశాలు మాంద్యం బారినపడుతాయన్నారు. ఇప్పటికే ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్న చాలా ఆసియా దేశాలు మాంద్యం బారినపడే ప్రమాదం ఉందని ఇటీవల బ్లూమ్బర్గ్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం చైనా మాంద్యంలోకి కూరుకుపోయే అవకాశాలు 20 శాతం ఉన్నాయి. అమెరికాలో 40 శాతం, యూరప్లో 55 శాతం ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రపంచ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ఇది మాంద్యం ప్రమాదాన్ని పెంచింది. ఆసియా ఆర్థిక వ్యవస్థలు యూరప్, అమెరికా కంటే మరింత స్థితిస్థాపతను కలిగి ఉన్నాయి. అయితే, ఆసియా దేశాలు 20 నుంచి 25 శాతం మాంద్యం బారినపడే అవకాశాలున్నాయి.
#WATCH | “We’re not going to be in a recession, in my view,” said US President Joe Biden, further adding, “the unemployment rate is still one of the lowest we’ve had in history. It’s in the 3.6% area. We still find ourselves with people investing…” pic.twitter.com/yR5I0MKtdC
— ANI (@ANI) July 25, 2022