వకీల్ సాబ్తో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నాడు. ఇటీవల పవన్కు కరోనా రావడంతో ఆయన కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకొని కోలుకున్నారు. రెండు నెలల పాటు ఆయనకు పూర్తి విశ్రాంతి కావాలని వైద్యులు చెప్పడంతో ఇంటికే పరిమితమయ్యారు పవన్. అయితే లాక్డౌన్ తర్వాత తాను కమిటైన సినిమాలను తప్పక పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు.
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తుండగా, ఈ మూవీకి సంబంధించి నిత్యం అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజా కథనాల ప్రకారం వీరమల్లు సినిమాలో పవన్ త్రిపాత్రభినయం చేయనున్నట్లు టాక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్స్ ను డైరెక్టర్ క్రిష్ అద్భుతంగా డిజైన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జులై నుండి స్టార్ట్ కాబోతుందని టాక్.