Imran Khan | పాకిస్థాన్లోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అనుమతి లేకుండా ప్రభుత్వాధికారులు విదేశాలకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ అయినట్లు జియోన్యూస్ టీవీ వార్తా కథనం ప్రసారం చేసింది. అదే విధంగా ఇస్లామాబాద్ పోలీసులతోపాటు పౌర అధికారులకు ఇచ్చిన సెలవులను రద్దు చేసినట్లు సమాచారం. ఇస్లామాబాద్లోని అన్ని దవాఖానాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ జరుగాల్సి ఉంది. కడపటి వార్తలందే సమయానికి ఇంకా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాల్లో హై అలర్ట్, అధికారుల సెలవుల రద్దు, దవాఖానాల్లో ఎమర్జెనీ ప్రకటించినట్లు వచ్చిన వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది.