లాస్ఏంజెల్స్, ఏప్రిల్ 28: శాస్త్ర, సాంకేతిక రంగం ఇంత అభివృద్ధి చెంది నా ఇప్పటికీ అంతుచిక్కని కొన్ని ప్రశ్న ల్లో గ్రహాంతరవాసుల ఉనికి ఒకటి. భూమిపై మనం జీవిస్తున్నట్టే ఇతర గ్ర హాల్లో ఏలియెన్స్ జీవిస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు.
అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం ఏలియన్స్ ఉనికి ఉన్నదని బలంగా నమ్ముతున్నారు. 2029 నాటికి వారు భూమిని సంప్రదించవచ్చని అంచనా వేస్తున్నారు. 2002లో నాసా నక్షత్రానికి పంపించిన రేడియో తరంగాల సంకేతాలను గ్రహాంతరవాసులు అడ్డగించి, తిరిగి వాటిని భూమివైపు పంపించారని, తమ అంచనా నిజమైతే సంకేతాలు 2029 నాటికి భూమికి చేరవచ్చని పేర్కొన్నారు.