Khamenei Funeral : అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) దాడుల్లో మరణించిన ఇరాన్ (Iran) మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayathollah Ali Khamenei) అంత్యక్రియలకు (Khamenei’s funeral) ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 5 వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు ఈ అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. భారత్ తరఫున కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా (Pavitra Margarita), బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ హాజరుకానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇరాన్ వర్గాలు పేర్కొనగా దీనిపై ఇంతవరకు భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేపట్టిన తొలి రోజే 86 ఏళ్ల అలీ ఖమేనీ సహా 40 మంది అత్యున్నత సైనికాధికారులు మృతిచెందారు. ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మృతిచెందగా.. కుమారుడు మొజ్తాబా కూడా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. జూలై 9న ఖమేనీ స్వస్థలం మషాద్లో ఆయనను ఖననం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రెండు కోట్లకు మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానించారు.