అడిస్ అబబ: ఇథియోపియా దేశం ఉత్తర టిగ్రే ప్రాంతంలోని టొగొగాలోగల ఓ మార్కెట్పై జరిగిన వైమానిక దాడిలో దాదాపు 80 మంది మృతిచెందారు. వందలాది మంది గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. గతేడాది నవంబర్ నుంచి ఇథియోపియా సైనికులకు, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టీపీఎల్ఎఫ్) తిరుగుబాటు దళాలకు మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజా వైమానిక దాడి చోటుచేసుకుంది. టొగొగా మార్కెట్పై విమానం ద్వారా బాంబులు జారవిడవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. పైగా దాడిలో గాయపడిన వారికి వైద్యం అందించేందుకు కూడా సిబ్బందిని సైనికులు అనుమతించడం లేదు. ఘటనా స్థలానికి బయలుదేరిన అంబులెన్సులను కూడా వెనక్కి పంపిస్తున్నారు. దాంతో క్షతగాత్రుల్లో మరికొందరు మృతిచెంది మృతుల సంఖ్య మరింత అవకాశం ఉంది.