కాఠ్మాండు: పెను విమాన ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా, నేపాల్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాలు గాలిలో ఢీకొనబోయాయి. అధికారులు పైలట్లను హెచ్చరించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం నేపాల్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కౌలాలంపూర్ నుంచి కాఠ్మాండుకు, ఎయిర్ ఇండియా విమానం న్యూఢిల్లీ నుంచి కాఠ్మాండుకు వస్తున్నాయి.
నేపాల్ గగనతలంలోకి ఇవి అతి సమీపానికి వచ్చాయి. ఎయిర్ఇండియా విమానం 19 వేల అడుగుల నుంచి కిందకు దిగుతుండగా, అదే సమయంలో నేపాల్ ఎయిర్లైన్స్ విమానం అదే ప్రాంతంలో 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నది. రెండూ అత్యంత దగ్గరలో ఉన్నాయని రాడార్ హెచ్చరించడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. వెంటనే నేపాల్ ఎయిర్లైన్స్ విమానాన్ని 7 వేల అడుగులు కిందకు దింపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ముగ్గురు ఎయిర్ట్రాఫిక్ కంట్రోలర్లను నేపాల్ పౌర విమానయాన సంస్థ సస్పెండ్ చేసింది.
కూలిన కోస్ట్గార్డ్ హెలికాప్టర్
కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కోస్ట్గార్డ్ అడ్వాన్డ్స్ లైట్ హెలికాప్టర్ బయలుదేరగానే కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కారణంగా మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటలపాటు ఎయిర్పోర్టులో రన్ వే సేవలు నిలిపేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.