వాషింగ్టన్: ఒక మహిళ దారుణానికి పాల్పడింది. స్కూల్లో అల్లరిపై ఫిర్యాదు రావడంతో శిక్షగా కుమారుడ్ని బలవంతంగా రోడ్డుపై నడిపించింది. అంతేగాక ఆ చిన్నారిపై నుంచి కారును దూకించింది. (US Woman Runs Car Over Son) అదృష్టవశాత్తు ఆ బాలుడు గాయాలతో బయటపడ్డాడు. అమెరికాలోని అలబామాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 9న 27 ఏళ్ల సారాయ్ రాచెల్ జేమ్స్ తన ఏడేళ్ల కుమారుడ్ని ఇంటికి తెచ్చేందుకు కారులో స్కూల్కు వెళ్లింది. అయితే ఆ బాలుడి పవర్తనపై స్కూల్ ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశాడు. దీంతో కుమారుడ్ని శిక్షించాలని అతడి తల్లి భావించింది. అర కిలోమీటరు దూరంపైగా ఇల్లు ఉండగా కారు ఉంచి అతడ్ని బలవంతంగా దించివేసింది. ఇంటి వరకు నడిచి లేదా పరుగెత్తి రావాలని ఆదేశించింది.
కాగా, రోడ్డు పక్కగా పరుగెత్తిన ఆ బాలుడు కారు నెమ్మెదిగా వెళ్లడంతో వెనుక డోర్ తీసి ఎక్కేందుకు ప్రయత్నించాడు. పట్టించుకోని తల్లి ఉన్నట్టుండి కారు వేగం పెంచింది. దీంతో ఆ బాలుడు కారు వెనుక చక్రాల కింద పడ్డాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన బాలుడికి చికిత్స అందించారు. అనంతరం సంరక్షణ కేంద్రానికి తరలించారు. దేవుడి దయ వల్ల ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. బాలుడి తల్లితోపాటు ఆ కారులో ఉన్న 53 ఏళ్ల మరో మహిళను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై వారిని విడుదల చేశారు. పిల్లల సంరక్షణ చట్టాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.