మారిసిల్లే: టర్కీ నుంచి ఫ్రాన్స్కు వెళ్లనున్న విమానంలో ఓ గర్భిణి శిశువుకు జన్మనిచ్చింది. విమానం టేకాఫ్ తీసుకోవడానికి ముందే ఈ ఘటన జరిగింది. ఫ్రాన్స్లోని మారిసిల్లేకు వెళ్లేందుకు విమానం ఎక్కిన మహిళకు అకస్మాత్తుగా నొప్పులు వచ్చాయి. దీంతో ఆ విమానంలో ఉన్న సిబ్బంది తక్షణమే స్పందించారు. సబిహ గోకెన్ విమానాశ్రయంలో ఉన్న పారామెడిక్స్ ఆ మహిళను మరోసీటుకు తరలించి పురుడు పోశారు. పెగాసస్ ఎయిర్లైన్స్ విమానం(Pegasus Flight)లో ఈ ఘటన జరిగింది. చివరకు ఓ మహిళా పారామెడిక్.. విమానం నుంచి బేబీని పట్టుకువచ్చింది. ప్రిమాచూర్ బేబీగా డాక్టర్లు గుర్తించారు. ఆ శిశువును తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఇటీవల ఓ మహిళ విమానంలో బత్రూమ్కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈక్వెడార్ నుంచి అమస్టర్డ్యామ్ వెళ్తున్న కేఎల్ఎం రాయల్ డచ్ విమానంలో ఆ ఘటన జరిగింది.