లండన్ : యూకేకు చెందిన హెల్త్ స్టార్టప్ కృత్రిమ మేధతో సంచలనాన్ని సృష్టించింది. ఇండిగో వీఎక్స్ అనే పేరుతో ఏఐ వ్యవస్థను తమ కంపెనీ సీఈవోగా నియమించింది. హున్నా టెక్నాలజీ సహ వ్యవస్థాపకుడు అహ్మద్ లజీమ్ దీని గురించి మాట్లాడుతూ మనుషుల పర్యవేక్షణలో ఏఐ తన(సహ వ్యవస్థాపకుడి) పనిని అధిగమించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన ఇటీవలే తన బాధ్యత నుంచి వైదొలిగారు. గణిత అల్గారిథమ్ ద్వారా ఈ ఏఐ సీఈవో పని చేస్తుందని లజీమ్ తెలిపారు. సంప్రదాయ చాట్ బోట్స్కు భిన్నంగా ఇండిగో వీఎక్స్ మానవ నిపుణులతోనూ, ఏఐతోనూ సమర్థంగా పని చేస్తుందని వెల్లడించారు. ఉన్నత స్థాయి నిర్ణయాలు, వ్యూహాలను అమలు చేస్తుందని ఆయన చెప్పారు. 12 నెలల పాటు ఇండిగో వీఎక్స్ భద్రత, చట్టపరమైన ప్రమాణాలను పరీక్షించాకే దాన్ని సీఈవోగా నియమించామని వెల్లడించారు.