కోపెన్హాగన్: యాంటిబయాటిక్స్ వాడకం వల్ల లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. వీటి వాడకం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియాలు నశిస్తాయని తెలిపింది. జర్మనీలోని హిడెల్బర్గ్లోని యూరోపియన్ మాలిక్యూలర్ బయాలజీ లాబోరేటరికి చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు.
యాంటిబయాటిక్స్ల వాడకం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియాలు నాశనమవుతాయని తేల్చారు. ఇవి నశించడం వల్ల గ్యాస్ సంబంధిత రోగాలు, ఊబకాయం, తామర, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.