న్యూయార్క్: వృథాను అరికడుతూ ఎలాంటి నిరోధకత లేకుండా సజావుగా విద్యుత్తు సరఫరా చేయగలిగే కొత్త పదార్థాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్కు చెందిన ప్రొఫెసర్ రంగా దియాస్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం.. అరుదైన లుటేటియంలో హైడ్రోజన్, కొంత మోతాదులో నైట్రోజన్ను కలిపి ఈ సూపర్కండక్టింగ్ మెటీరియల్ను అభివృద్ధి చేసింది. దీనికి ‘రెడ్ మ్యాటర్’ అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. కాగా, ప్రో రంగా దియాస్ డేటా మానిపులేషన్కు పాల్పడ్డారని ప్రముఖ ఫిజిక్స్ జర్నల్ ఫిజికల్ రివ్యూ లెటర్స్(పీఆర్ఎల్) ఇటీవలే విచారణ ప్రారంభించింది.