వెస్ట్రర్న్ కంట్రీస్లో మరుగుదొడ్డిలో టాయిలెట్ పేపర్ కంపల్సరీ. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి అది అత్యవసర వస్తువు. కరోనా లాక్డౌన్ సమయంలో అమెరికా, ఫ్రాన్స్లో స్టోర్ల ఎదుట టాయిలెట్ పేపర్కోసం పెద్ద ఎత్తున క్యూకట్టారు. ఇందుకోసం వారు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. కాగా, ఓ ముగ్గురు పిల్లలున్న తల్లి తన కుటుంబ అప్పులు తీర్చేందుకు టాయిలెట్ పేపర్ వాడకాన్ని మానేసింది. వాటికి ఖర్చు చేసే డబ్బులను సేవ్ చేసి, కొన్ని అప్పులు తీర్చేసింది. దీనికి సంబంధించి ఆమె ఓ వీడియో చేయగా, నెట్టింట వైరల్గా మారింది.
అంబర్ అల్లెన్ అనే మహిళ ‘ది ఫెయిర్లీ లోకల్ ఫ్యామిలీ’ అనే యూట్యూబ్ చానల్ రన్ చేస్తున్నది. ఆమెకు ముగ్గురు పిల్లలు. 70వేల డాలర్ల అప్పుంది. అయితే, ఈ అప్పు తీర్చేందుకు నెలవారీ ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం టాయిలెట్ పేపర్ల వాడకాన్ని మానేసింది. వాటి బదులు పాత బట్టలు వాడడం ప్రారంభించింది. ఇలా 2,100 డాలర్లు సేవ్ చేసి, అప్పుల భారం కొంత తగ్గించుకున్నది. ఈ విషయంపై ఆమె తన యూట్యూబ్ చానల్లో వీడియో చేసి పెట్టగా, చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 59వేల మంది వీక్షించారు.