ఈ అవకాశం అందరికీ రాదు
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
కొత్త కార్పొరేటర్లతో మంత్రి ఎర్రబెల్లి
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై ప్రత్యేక సమావేశం
అధిష్టానానిదే నిర్ణయమని స్పష్టం
తీర్మానం చేసిన కొత్త కార్పొరేటర్లు
ఎన్నికల పరిశీలకులుగా రానున్న మంత్రులు గంగుల, అల్లోల
హన్మకొండ, మే 5: ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం గొప్ప విషయమని, దాన్ని నిలబెట్టుకునేలా పనితీరు ఉండా లని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్ని కపై గ్రేటర్ వరంగల్లో కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొ రేటర్లతో హన్మకొండలోని ఓ హోటల్లో బుధవారం సమావే శం నిర్వహించారు. ఇక్కడ ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. రాజ కీయాల్లో ప్రజల మద్దతు పొందడం గొప్ప అనుభూతిగా ఉంటుందని, మంచి నడవడికతో దాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఆద రణను పెంచుకోవాలని సూచించారు. తాత్కాలిక ప్రయోజ నాల ద్వారా ప్రజల మన్ననలు పొందలేరని చెప్పారు. జవా బుదారీతనంతో పనిచేస్తే ప్రజల మదిలో ఎల్లకాలం నిలిచి పోతామని, ఏ ఎన్నిక అయినా వారి మద్దతు ఉంటుంద న్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం కల్పిస్తూ వారికి అందుబాటులో ఉంటే మంచి పేరు వస్తుందని చెప్పారు.
నిర్ణయాధికారం అధిష్టానానికి..
కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అధికారా న్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగిస్తూ కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల విష యంలో అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా మని తీర్మానంలో పేర్కొన్నారు. టీఆర్ఎస్కు అండగా నిలిచి న వరంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కా ర్పొరేటర్లు కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీఆర్ఎస్ నా యకులు జన్ను జకార్య, సుందర్రాజుయాదవ్ పాల్గొన్నారు.
పరిశీలకుల నియామకం..
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రకియ కోసం టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, గంగుల కమలాకర్ను పరిశీలకులుగా నియమించారు. వీరు గురువారం సాయంత్రం వరంగల్ చేరుకుంటారు. అధిష్టా నం నిర్ణయించిన పేర్లతో ఉన్న ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూస్తారు. కొత్త కార్పొరేటర్లతో గురువారం ఉదయం సమావేశం నిర్వహించి మేయర్, డిప్యూటీ మేయ ర్ను ఎన్నుకుంటారు.