బాగ్దాద్, ఏప్రిల్ 25: ఇరాక్లో ఘోరం జరిగింది. కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఇబన్ అల్ ఖతీబ్ దవాఖానలో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. 82 మంది మంటల్లో చిక్కుకొని మాడిపోయారు. 110 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 మందిని రక్షించారు. మృతుల్లో 28 మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఫైర్ సేఫ్టీ వ్యవస్థ లేకపోవడం, వెంటనే అగ్నిమాపక చర్యలు చేపట్టకపోవడంతో మంటలు ఐసీయూ నుంచి దవాఖాన అంతటా పాకాయి.