మొగధీషు: సొమాలియాలో అల్ షబాబ్ ఉగ్రవాదులు ఓ హోటల్పై అటాక్ చేశారు. ఆ ఘటనలో 8 మంది మృతిచెందారు. రాజధాని మొగధీషులో ఈ ఘటన జరిగినట్లు భద్రతా అధికారులు తెలిపారు. హోటల్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు అక్కడ కొంత మందిని బంధీ చేశారు. అయితే భద్రతా దళాలు ఆ హోటల్లోకి ప్రవేశించి ఉగ్రవాదుల్ని నేలకూల్చారు. మొగధీషులోని హోటల్ హయ్యత్ వద్ద రెండు కారు బాంబు పేలుళ్ల ఘటనలు జరిగాయి. ఆ దాడులకు కూడా అల్ షబాబ్ కారణమని తెలుస్తోంది.