శాన్ఫ్రాన్సిస్కో, అక్టోబర్ 27: ట్విట్టర్ తన చేతికి వచ్చిన తర్వాత ఉద్యోగులను భారీగా తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. ప్రచారం జరుగుతున్నట్టుగా 75 శాతం ఉద్యోగులను తాను తొలగించబోనని పేర్కొన్నారు. అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని మస్క్ బుధవారం సందర్శించారు.
ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘చాలా మంది’ని తొలగించనని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నంబర్ చెప్పకుండా.. ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపుపై మస్క్ పలుమార్లు తన ట్వీట్లలో ప్రస్తావించారు. ట్విట్టర్ను టేకోవర్ చేసే ప్రక్రియ శుక్రవారానికి ముగిసే అవకాశం ఉన్నదని మస్క్ బ్యాంకర్లకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే