న్యూయార్క్, సెప్టెంబర్ 25: పిక్నిక్కు వెళ్తే ఎంజాయ్ చేసి, అక్కడే స్నాక్స్, కూల్డ్రింక్స్ లాగించి వ్యర్థాలు అక్కడే పడేసి వస్తుంటాం. అచ్చం అలాగే మన శాస్త్రవేత్తలు కూడా మార్స్పై అలాగే వ్యర్థాలను పడేశారట. ఆ వ్యర్థాల బరువు ఎంతంటే.. ఏకంగా 7 వేల కిలోలు. అందులో అన్నీ పాడైన హార్డ్వేర్ పరికరాలు, వ్యోమనౌకల శిథిలాలే ఉన్నాయి. అంగారకుడిపై మనిషి అడుగు పడకుండానే ఈ స్థాయిలో వ్యర్థాలు పోగయ్యాయంటే, మనిషి అడుగు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.