మాస్కో: రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాత్రి జరిగిన దాడిలో 600 మంది ఉక్రేనియన్లు మృతిచెందినట్లు రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. ఉక్రెయిన్కు చెందిన సైనిక పోస్టులు, సామాగ్రి కేంద్రాలను రష్యా టార్గెట్ చేసింది. సెంట్రల్ కిరోవ్రాడ్ ప్రాంతంలో ఉన్న కనటోవో విమానాశ్రయం వద్ద ఉన్న ఆయుధ డిపోపై వైమానిక దాడి చేశారు. మైకోలెయివ్ నగరంలో ఉన్న ఆయుధ బాండాగారాన్ని కూడా పేల్చేశారు. ఈ దాడుల్లో 600 మంది ఉక్రేనియన్లు మృతిచెందినట్లు తెలుస్తోంది.
ఫ్రంట్లైన్లో ప్రాణాలు కోల్పోయిన ఓ జర్నలిస్టుకు బుధవారం లెన్స్కీ నివాళి అర్పించారు. 36 ఏళ్ల అలెగ్జాండర్ మాకోవ్ రష్యా చేసిన దాడిలో ఖార్కీవ్ ప్రాంతం వద్ద మరణించినట్లు జెలెన్స్కీ తెలిపారు.