బాల్టిమోర్: అమెరికాలోని బాల్టిమోర్లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్(Baltimore Bridge)ను ఓ సరుకు రవాణా నౌక ఢీకొన్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. నౌక ఢీకొన్న సమయంలో మిస్సైన వారు మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. దాలి అనే కంటేనర్ షిప్లో సిబ్బంది మొత్తం భారతీయులే అని తేలింది. నౌక ప్రయాణిస్తున్న సమయంలో పవర్ పోయిందని, దాంతో ఆ నౌక బ్రిడ్జ్ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. 22 మంది నౌకా సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. బ్రిడ్జ్పై రిపేర్ వర్క్ చేస్తున్న ఆరుగురు మిస్సింగ్లో ఉన్నట్లు గుర్తించారు. నౌక ఢీకొన్న సమయంలో బ్రిడ్జ్పై ఉన్న గుంతలను ఆ వర్కర్లు రిపేర్ చేస్తున్నారు.