సుమత్రా: హిందూ మహాసముద్ర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో (Indonesia) భారీ భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున మూడు దేశాల్లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. ఉదయం 4.06 గంటల సమయంలో ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.7గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. సముద్ర తీరపట్టణమైన పరియమాన్కు 167 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొన్నది. భూ అంతర్భాగంలో 21 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని చెప్పింది.
మలేషియాలో సోమవారం తెల్లవారుజామున 2.39 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 6.8గా నమోదయింది. కౌలాలంపూర్కు 504 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
ఫిలిప్పీన్స్లోని బటాన్ ప్రావిన్స్లోని లుజాన్ దీవిలో ఉదయం 5.05 గంటల సమయంలో భూ ప్రకంపణలు వచ్చాయి. దీనితీవ్రత 6.4గా నమోదయిందని, మనీలాకు 157 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొన్నది.