తైపీ సిటీ : తూర్పు తైవాన్ తీరంలో సోమవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని సెంట్రల్ వెదర్ బ్యూరో తెలిపింది. భారీ ప్రకంపనలకు తైపీ సిటీలో భారీ ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది. దాదాపు 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు తైపీ మీడియా తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని పేర్కొంది. భారీ భూకంపం ధాటికి తైవాన్కు దగ్గరలో ఉన్న జపాన్, ఫిలిప్పీన్స్, చైనా జియాన్ టౌన్షిప్, హువాలియన్ కౌంటీల్లోనూ ప్రకంపనలు రికార్డయ్యాయి.