జకార్తా: ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ప్రయాణికుల ఫెర్రీ(నౌక) అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 41 మంది గల్లంత య్యారు. మకాసర్కు 271 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఈ నౌక బయలుదేరింది. మదురా ద్వీపం దగ్గరకు రాగానే నౌకలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ ఏజెన్సీ సహాయక చర్యలు చేపట్టింది.
ఆదివారం మధ్యాహ్నం వరకూ 225 మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్కు తీవ్ర అంతరాయం కలుగుతున్నదని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. అతిపెద్ద ద్వీప దేశమైన ఇండోనేషియాలో నిబంధనలు పాటించకపోవడంతో బోటు ప్రమాదాలు తరచూ జరుగుతుండటం పరిపాటిగా మారింది.