టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ (Texas) రాష్ట్రంలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) టెక్సాస్లోని మిడ్లాండ్ పట్టణంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మిడ్లాండ్కు 22 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 9 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొన్నది.
కాగా, టెక్సాస్ రాష్ట్రంలో వచ్చిన అతిపెద్ద భూకంపాల్లో ఇది నాలుగోదని అధికారులు తెలిపారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. నెల రోజుల వ్యవధిలో మిడ్లాండ్లో భూకంపం రావడం ఇది రెండోసారి. గత నెల 16న కూడా 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.