దుబాయ్, ఆగస్టు 2: దుబాయ్లో ఉంటున్న ప్రవాస భారతీయుడికి జాక్పాట్ తగిలింది. యూఏఈలో తీసిన వారాంతపు డ్రాలో ముంబయికి చెందిన సచిన్ 20 మిలియన్ల దిర్హమ్లు (సుమారు రూ.45 కోట్లు) గెల్చుకున్నాడు. దీంతో ఈ డ్రా ద్వారా మిలియనీర్లుగా మారిన భారతీయుల సంఖ్య 20కి చేరింది. ఇదే డ్రాలో భారత్కే చెందిన గౌతమ్ అనే వ్యక్తి రూ.2.25 కోట్లు గెల్చుకున్నాడు.