లాస్ ఏంజెల్స్: అమెరికా రోసారి కాల్పుల మోతతో వణికిపోయింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్లో (Los Angeles) దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లాస్ ఏంజెల్స్కు సమీపంలో ఉన్న ఇంగ్లెవుడ్లోని ఓ ఇంట్లో పార్టీ జరుగుతున్నది. అంతా దావత్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఆ ఇంటిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
దీంతో నలుగురు మృతి చెందారని, మరొకరు గాయపడ్డారని ఇంగ్లెవుడ్ మేయర్ జేమ్స్ బట్స్ తెలిపారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని వెల్లడించారు. 1990 తర్వాత ఇంగ్లెవుడ్లో ఇదే అతిపెద్ద కాల్పుల ఘటన అన్నారు.
హాలీవుడ్కు నిలయమైన లాస్ ఏంజెల్స్కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంగ్లెవుడ్లో లక్ష మంది జనాభా ఉంటుంది. ఇక్కడ ప్రముఖ సోఫీ స్టేడియం ఉన్నది.