యునైటెడ్ నేషన్స్, మార్చి 22: ప్రపంచ జనాభాలో 26 శాతం మందికి శుద్ధమైన తాగునీరు అందడం లేదని, 46 శాతం మందికి కనీ స పారిశుధ్య సదుపాయాలు అందుబాటులో లేవని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని ప్రజలందరికీ 2023 నాటికల్లా శుద్ధమైన తాగునీరు, పారిశుధ్య సదుపాయా లు అందాలని ఐరాస పెట్టుకొన్న లక్ష్యానికి చాలా దూరంలో ఉన్నామని యూఎన్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్టు-2023లో పే ర్కొన్నది. లక్ష్యాలను చేరుకొనేందుకు ఏడాదికి 600 బిలియన్ నుంచి ఒక ట్రిలియర్ డాలర్ల మధ్య చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదిక ఎడిటర్ ఇన్ చీఫ్ రిచర్డ్ కాన్నర్ తెలిపారు. గత 40 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా నీటి వినియోగం ఏడాదికి దాదాపు ఒక శాతం వరకు పెరుగుతున్నదని పేర్కొన్నారు.