అలెప్పొ: సిరియా జైలులో శిక్ష అనుభవిస్తున్న 20 మంది జిహాదీలు తప్పించుకున్నారు. సోమవారం వచ్చిన భూకంపం వల్ల జైలు ధ్వంసమైంది. అయితే ఆ జైలులో ఉన్న 20 మంది ఖైదీలు పరారీ అయినట్లు అధికారులు వెల్లడించారు. తుర్కియే బోర్డర్ సమీపంలో ఉన్న రాజో జైలు నుంచి ఆ జిహాదీలు పరారీ అయ్యారు. దాంట్లో సుమారు రెండు వేల మంది ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఖైదీల్లో దాదాపు 1300 మంది ఐఎస్ ఫైటర్ల ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కుర్దిష్ నేతృత్వంలోని ఫైటర్లు కూడా జైలులో ఉంటున్నట్లు అధికారులు వెల్లడించారు. 7.8 తీవ్రతతో భూకంపం రావడం వల్ల జైలులో ఉన్న గోడలు, డోర్లు పగిలిపోయాయి. దీంతో ఖైదీలు తప్పించుకుంటున్నారు. జైలులో తిరుగుబాటు చేపట్టిన ఖైదీలు హింసకు దిగారు. ఇస్లామిక్ స్టేట్కు చెందిన 20 మంది మిలిటెంట్లు పరారీ అయినట్లు జైలు అధికారి వెల్లడించారు.