లిమా: పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర పెరూలోని (Peru) లిబర్టాడ్ రీజియన్లో ఓ బస్సు లోయలో పడిపోయింది. దీంతో సుమారు 20 మంది మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. తయబాంబా నుంచి ట్రుజిల్లోకు వెళ్తున్న బస్సు లిబర్టాడ్ రీజియన్లో అదుపుతప్పి లోయలో పడిపోయింది. వంద మీటర్ల లోతులో పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. దీంతో నాలుగేండ్ల చిన్నారి సహా 20 మంది అక్కడికక్కడే మరణించారని అధికారులు తెలిపారు.
పెరూలో అతి వేగం, రోడ్లు సరిగా లేకపోవడం, ప్రమాద సూచికలు లేకపోవడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. గతేడాది నవంబర్లో ఉత్తర పెరువియన్ అటవీ ప్రాంతంలో మినీబస్సు బోల్తాపడింది. దీంతో పది మంది మృతిచెందారు.