లండన్: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో (Heathrow Airport) పెను ప్రమాదం తప్పింది. రన్వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్కు చెందిన బోయింగ్ 787-9 విమానం ప్రయాణాన్ని ముగించుకున్నది. దీంతో దానిని మరో ప్రదేశానికి లాక్కెళ్తున్నారు.
ఈక్రమంలో టెర్మినల్ వద్ద బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఎయిర్క్రాఫ్ట్ను తగలడంతో రెండు విమానాల రెక్కలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కాగా, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రకటించింది.