cylinder Blast In Train | పాకిస్థాన్ (Pakistan)లోని క్వెట్టా (Quetta) వెళ్లే జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు (Jaffer Express train)లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ మీడియా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..
పెషావర్ నుంచి క్వెట్టాకు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు.. చిచావత్ని రైల్వే స్టేషన్ వద్దకు రాగానే నాలుగో నంబర్ బోగీలో సిలిండ్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిలిండర్ను ఓ ప్రయాణికుడు రైలు వాష్రూమ్లోకి తీసుకెళ్లినట్లు రైల్వే అధికారి ఒకరు చెప్పినట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. రైలు, ట్రాక్ మొత్తాన్ని పరిశీలించి.. పేలుడు జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనలో ఉగ్రకోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.