బాగ్దాద్, జూలై 19: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో బాంబు పేలిన ఘటనలో సుమారు 18 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం బాగ్దాద్ శివారులోని సద్ సిటీలో ఓ మార్కెట్ వద్ద ఈ పేలుడు సంభవించినట్టు పేర్కొన్నారు. బుధవారం ఈద్ అల్-అదా పర్వదినం కావడంతో మార్కెట్ ఏరియాలో భారీ ఎత్తున జనం గుమిగూడటంతో దుండగులు బాంబును పేల్చారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో బాధితులు గాయపడ్డట్టు తెలుస్తున్నది.