Bird flu | లండన్: కరోనా కంటే ప్రాణాంతకమైన బర్డ్ఫ్లూ మానవాళిపై విరుచుకుపడే ప్రమాదం ఉన్నదని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బర్డ్ఫ్లూలోని హెచ్5ఎన్1 రకం వైరస్ మహమ్మారిగా మారవచ్చని పేర్కొన్నారు. ‘కరోనా కంటే ప్రాణాంతకమైన బర్డ్ఫ్లూ మానవాళిపై విరుచుకుపడే ప్రమాదం ఉన్నదని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బర్డ్ఫ్లూలోని హెచ్5ఎన్1 రకం వైరస్ మహమ్మారిగా మారవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి డెయిలీ మెయిల్’లో ఒక కథనం ప్రచురితమైంది.
ఈ బర్డ్ఫ్లూకు మానవాళి చేరువవుతున్నదని, ఈ వైరస్ మనుషులతో పాటు జంతువులకు కూడా వ్యాపించవచ్చని అమెరికాలోని పిట్స్బర్గ్కు చెందిన బర్డ్ఫ్లూ పరిశోధకులు డాక్టర్ సురేశ్ కూచిపూడి పేర్కొన్నారు. ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చే వైరస్ కాదని, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నదేనని తెలిపారు. దీనిని ఎదుర్కొనేందుకు వెంటనే సిద్ధం కావాల్సి ఉందన్నారు. కెనడాకు చెందిన ఫార్మారంగ నిపుణులు జాన్ ఫౌల్టన్ కూడా బర్డ్ఫ్లూపై ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్5ఎన్1 వేరియంట్ మహమ్మారిగా మారవచ్చని, ఇది కొవిడ్-19 కంటే 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని తెలిపారు.