జెనీవా : అనేక దేశాలు నియంత్రించాలని చూసినా, ఉగ్రవాద సంస్థ అల్ఖైదా మళ్లీ తన సామర్థ్యాన్ని పెంచుకొంటున్నట్టు ఐరాస పర్యవేక్షణ బృందం నివేదిక వెల్లడించింది. అమెరికాలో 9/11 దాడుల సమయంలో ఆ సంస్థ 5 వేల మంది సభ్యులను కలిగి ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 25 వేలకు చేరుకుందని తెలిపింది.
బ్రిటిష్ ఎం16 తదితర నిఘా సంస్థల సమాచారం మేరకు ఈ సంఖ్యను వెల్లడించింది. తమ వార్షిక ఉగ్రవాద ముప్పు నివేదికలో ఈ విషయాలను తెలియజేసింది. ఐసిస్ లాంటి సంస్థలు పుట్టుకొచ్చినా అల్ఖైదా తన కార్యకలాపాల నుంచి వెనక్కి తగ్గలేదని నివేదిక వివరించింది. ఇప్పటికీ ఆ సంస్థ కుట్రలు, దాడులకు ప్రణాళికలను రచిస్తున్నదని తెలిపింది.