ఎల్బీనగర్: బాలానగర్లో హయత్నగర్ సర్కిల్ ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై పడిన వైనంపై విచారణకు వెటర్నరీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ రణజిత్ను నియమించినట్లు జోనల్ కమిషనర్ పంకజ తెలిపారు. 24 గంటల్లో రిపోర్టు ఇవ్వాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ ఆదేశాలు జారీ చేశారు. ఈ రిపోర్టు అందిన వెంటనే తగు చర్యల కోసం జీహెచ్ఎంసీ కమిషనర్కు నివేదిస్తామని ఆమె వివరించారు.
హయత్నగర్ సర్కిల్కు చెందిన ప్రజాపాలన దరఖాస్తులు డేటా ఎంట్రీకి కూకట్పల్లిలోని ధర్మేందర్ ఏజెన్సీకి 13,760 దరఖాస్తు ఫారాలు అందజేశారు. 6వ తేదీన 5280, 7వ తేదీన 8480 దరఖాస్తులు అందజేశారు. ఏ ఒక్క దరఖాస్తు కూడా పోలేదు.
– ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ