కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 30 : ఆకలితో అలమటించే పేదలు, బాటసారులు సంతృప్తిగా భోజనం చేసేందుకు భోజనశాల ఉపయోగపడుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి జోనల్ కార్యాలయం ఎదుట అన్నపూర్ణ క్యాంటీన్ భోజన శాలను జడ్సీ మమతతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగరంలో నివసిస్తున్న పేదలు, వివిధ అవసరాల కోసం రోడ్డుపైకి వచ్చే బాటసారుల ఆకలిని తీర్చేందుకు అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ క్యాంటీన్ల ద్వారా నిత్యం వేలాది మంది ప్రజలు ఆకలి తీర్చుకుంటున్నారన్నారు. కానీ అన్నపూర్ణ కేంద్రాల వద్ద భోజనశాల లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మూసాపేటలో సకల వసతులతో భోజనశాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ భోజన శాలలో వానకాలం, వేసవి కాలం లో సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా కూర్చుని భోజనం చేయడానికి వీలుంటుందని చెప్పారు. తాగునీటితో పాటు చేతులు కడుక్కునేందుకు నీటి సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. నగరంలోనే మొదటి సారిగా భోజనశాలను నిర్మించినట్లు తెలిపారు. ప్రతి అన్నపూర్ణ కేంద్రం వద్ద ఇదే తరహాలో భోజన శాలలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, కార్పొరేటర్లు పగుడాల శిరీషాబాబురావు, మందడి శ్రీనివాస్రావు, ఆవుల రవీందర్రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, సబీహాబేగం, మాజీ కార్పొరేటర్ శ్రవణ్కుమార్, బాబురావు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 30 : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, నియోజకవర్గం అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో ప్రతి డివిజన్లో, బస్తీలో పార్టీ జెండాను ఎగురవేసి.. వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. డివిజన్, బస్తీ కమిటీలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, ముద్దం నర్సింహ, ఆవుల రవీందర్రెడ్డి, మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీషాబాబురావు, సబీహాబేగం, పండాల సతీశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్కుమార్, ఆయా డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.