ఎర్రగడ్డ : అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటంతో యువకులు సంబురాలు జరుపుకొన్నారు. బోరబండ చౌరస్తాలో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన సంబురాల్లో పటాకులు కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు. జై తెలంగాణ నినాదాలతో చౌరస్తా మార్మోగింది.
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించిన తర్వాత బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నదంటే అది కేవలం కేసీఆర్ వల్లనే అన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్న కేసీఆర్ను యువత ఎన్నడూ మరువలేదన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, నేతలు విజయకుమార్, యూసుఫ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డలో..
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచన మేరకు ఎర్రగడ్డ లో సంబురాలను జరుపుకొన్నారు. డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ ఆధ్వర్యంలో ఆనంద్నగర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు గంట మల్లేష్, మహేందర్, నర్సింహ, బాలకృష్ణ, శ్రీకాంత్, యాదగిరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.