Hyderabad | హైదరాబాద్లోని సరూర్నగర్లో దారుణం జరిగింది. తన ప్రేయసిని దూరం చేశారని కక్షతో సదరు యువతి తండ్రిపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతి తండ్రి కంటిలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. అంబర్పేటకు చెందిన బల్వీందర్ సింగ్ (25), సరూర్నగర్ పీఎస్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ రోడ్డు నంబర్ 14లో మల్లికా రాణి అపార్ట్మెంట్లో ఉంటున్న మాన్విత (23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ వాళ్ల ప్రేమ వ్యవహారం ఇష్టంలేని మాన్విత తండ్రి రేవంత్ ఆనంద్(57) ఆమెను అమెరికా పంపించేవాడు. ఈ విషయం తెలిసి బల్వీందర్ సింగ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
తన ప్రేయసిని తనకు దూరం చేశారని రేవంత్ ఆనంద్పై బల్వీందర్ సింగ్ కక్ష పెంచుకున్నాడు. కోపంతో రగిలిపోయిన బల్వీందర్ సింగ్.. మాన్విత ఇంటికి వెళ్లి ఆమె తండ్రి రేవంత్ ఆనంద్తో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ కాస్త ముదరడంతో తనతో తెచ్చుకున్న ఎయిర్గన్తో రేవంత్ ఆనంద్పై కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్ రేవంత్ ఆనంద్ కంటి నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బల్వీందర్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ ఆనంద్ను ఆస్పత్రికి తరలించారు.