తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 4: వరల్డ్ క్యాన్సర్ డే ను పురస్కరించుకొని ఎంఎన్జే వైద్య సిబ్బంది పలు బస్తీల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఖైరతాబాద్ బస్తీలో ఎంఎన్జే డైరెక్టర్ డాక్టర్ జయలత, వైద్యులు శ్రీకాంత్, నదీమ్ నేతృత్వంలో, విజయ్నగర్ కాలనీలో ఆర్ఎంవో డాక్టర్ నిర్మల సర్దార్, వైద్యులు విష్ణుప్రియ, అరుణ చైతన్య, కృష్ణల నేతృత్వంలో, బంజారాహిల్స్ పోచమ్మ దేవాలయం సమీపంలో వైద్యులు విశాల్, వెన్నెల, రాధిక కృష్ణ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీలు తీసి..
నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ప్రజలను చైతన్య పరిచారు. అనంతరం ఖైరతాబాద్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.