జవహర్నగర్, మార్చి 16 : సంపూర్ణ కరోనా కట్టడి దిశగా సర్కారు అడుగులు వేస్తున్నదని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం కార్పొరేషన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వ్యాధి నిరోధక టీకా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీకాను వేసుకోవాలని కోరారు. కరో నా కట్టడే లక్ష్యంగా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ ఆరోగ్య కర్యకర్తగా డి. హేమలత, ఉత్తమ ఆశ వర్కర్లుగా ఎ. విమల, మధవిలను సన్మానించి, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అదే విధంగా తాజాగా 12-14 ఏండ్ల వయసు గల వారికి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్పొరేటర్లు శ్రీనివాస్రెడ్డి, రాంచందర్, మెడికల్ ఆఫీసర్లు పద్మావతి, శైలేవ, ఆరోగ్య అధికారి షౌకత్అలీ, నాయకులు రాజశేఖర్, సతీశ్గౌడ్, శ్రీనాథ్, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.