ESI | వెంగళరావునగర్, సెప్టెంబర్ 16: ఓ యువతిపై ఈఎస్ఐ దవాఖానలోని క్యాంటీన్ సిబ్బంది ఒకరు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పి.వి.రామప్రసాదరావు తెలిపిన ప్రకారం.. కర్నాటక రాష్ర్టానికి చెందిన యువతి(19) ఈనెల 6న తన సోదరుడిని సనత్నగర్లోని ఈఎస్ఐ దవాఖానలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అప్పటి నుంచి ఆ యువతి బాధితుడి వద్దే ఉంటుంది. శుక్రవారం రాత్రి సోదరుడికి ఆహారం తీసుకువద్దామని యువతి కిందకు వచ్చి తిరిగి పైకి వెళ్తున్నది.
లిఫ్ట్ వద్ద దవాఖానకు చెందిన సెక్యూరిటీ గార్డు యువతితో సోదరుడికి యోగక్షేమాలు అడిగాడు. తన వెంట ఉన్న క్యాంటీన్లో పనిచేసే షాదాబ్(25) యువతికి పరిచయం చేశాడు. షాదాబ్ యువతికి తినేందుకు కోడి గుడ్డు ఇవ్వగా..యువతి క్యాంటిన్లో తినేసి తిరిగి లిఫ్ట్లో వెళుతుంటే షాదాబ్ 5వ అంతస్తులోకి వెళ్లిన అనంతరం యువతిని బలవంతంగా తిరిగి 2వ అంతస్తుకి తీసుకువచ్చాడు. ఓ కుర్చీలో కుర్చోబెట్టి తనకు రూ.30వేలు జీతం వస్తుందని పెండ్లి చేసుకుంటానని చెప్పాడు. అక్కడే 2వ అంతస్తులో లైంగిక దాడి చేశాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో అతడు పారిపోయాడు. దవాఖాన అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు షాదాబ్ను అదుపులోకి తీసుకున్నారు.