హైదరాబాద్ : నగరంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో కరోనా నియమాలను మరింత కఠినతరం చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మాస్కులు ధరించని వారికి వెయ్యిరూపాయల జరిమానా విధించే విధంగా నిబంధనలను అమల్లోకి తీసుకురాగా, ఇక నుంచి నగరంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లోకి మాస్కులు ధరిస్తేనే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని దవాఖానలకు ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి రోగులు, వారి సహాయకులు కచ్చితంగా మాస్కులు ధరించాలని, లేదంటే అనుమతించబోమని చెప్పారు.