సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భాగ్యనగరం నిప్పుల కుంపటిలా మారుతోంది. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40.7 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వాతావారణ శాఖ వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 29.4 డిగ్రీలుగా నమోదైంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నగర ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.