హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్లో మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.