పీర్జాదిగూడ, మార్చి 16 : ప్రతి గల్లీలో అభివృద్ధి పనులు చేపట్టి వసతులు కల్పించడమే ధ్యేయమని మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నా రు. ఈ మేరకు బుధవారం నగరపాకల పరిధి 15వ డివిజన్ వీజీ కాలనీలో స్థానిక కార్పొరేటర్ బండారు మంజుల రవీందర్తో కలిసి రూ. 12 లక్షల మున్సిపల్ కా ర్పొరేషన్ సాధారణ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు రవీందర్, దంతూరి వెంకటేశ్, సుమిత్, కాలనీ ప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.