సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : నగరాన్ని మరింత సుందరంగా మార్చేందుకు స్టాండింగ్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. రహదారుల, విస్తరణ చెరువుల శుద్ధీకరణ, పచ్చదనం పెంపునకు ఆమోదం తెలిపింది. నగర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 23 అంశాలకు ఆమోదం తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రహదారుల విస్తరణకు అనుగుణంగా భారీ ఆస్తుల సేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మురికికూపంగా మారిన చెరువులను స్వచ్ఛంగా మార్చేందుకు మురుగునీటి మళ్లింపు చర్యలు చేపట్టనున్నారు. సీఎస్ఆర్తో కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చి గ్రీనరీ పెంపునకు దత్తత తీసుకున్నాయి. స్టాండింగ్ కమిటీ సభ్యులైన శాంతి సాయి జెన్ శేఖర్, సయ్యద్ మినహజుద్దీన్, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, శమీనా బేగం, అబ్దుల్ వహాబ్, మహ్మద్ అబ్దుల్ ముఖద్దర్, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ రషీద్ ఫరజుద్దీన్, బండారి రాజ్ కుమార్, సంగీత యాదవ్, నరేందర్ యాదవ్, సతీశ్ బాబు, ఈఎస్ రాజ్, జితేందర్ నాథ్, సునీత, మహేశ్వరి, పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన అంశాలివే..