శేరిలింగంపల్లి, నవంబర్ 14: స్థానికంగా చేపట్టిన అభివృద్ధిని చూసి తనను ఆశీర్వదించాలని, మరోసారి అవకాశమిచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం గచ్చిబౌలి డివిజన్లోని గోపన్పల్లి గ్రామం, గోపన్పల్లి వీకర్ సెక్షన్ కాలనీ, రాజీవ్నగర్, గోపన్పల్లి తాండలో స్థానిక మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఇతర పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మంగళహారతులతో ఆయనకు స్వాగతం పలుకుతూ విజయ తిలకం దిద్దారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయ్యాలని స్థానికులకు అరెకపూడి గాంధీ అభ్యర్ధించారు.
శేరిలింగంపల్లి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాలకు తగ్గలు మౌలిక వసతులు కల్పించేందుకు మరో అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని కారు గుర్తుకే ఓటేసి బీఆర్ఎస్ జెండా శేరిలింగంపల్లిలో ఎగరవేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మూడోసారి తనపై నమ్మకంతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా గెలిపించి సత్తాచాటలని కోరారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు నీరుడి గణేశ్ ముదిరాజ్, చెన్నంరాజు ముదిరాజ్, జంగయ్య యాదవ్, సతీశ్ ముదిరాజ్, శంకరి రాజు ముదిరాజ్, దారుగుపల్లి నరేశ్, రమేశ్ గౌడ్ తదితర నాయకులు, మహిళ నాయకులు పార్టీశ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మియాపూర్, నవంబర్ 14 : నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడిన తన పట్ల ప్రజల ఆదరాభిమానాలు ఎంతో సంతృప్తినిస్తున్నదని రాబోయే అయిదేండ్లు వారి సేవలో తరించే అవకాశాన్ని కల్పించాలని విప్, బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ కోరారు. ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానాలను ఈనెల 30 వ తేదీన ఓట్ల రూపంలో ప్రదర్శించాలని విన్నవించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషి నగర్, ఏంఏ నగర్, స్టాలిన్ నగర్, ప్రశాంత్నగర్, మక్త మహబూబ్ పేట్, బీకే ఎన్క్లేవ్,రెడ్డి కాలనీలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, పార్టీ శ్రేణులతో కలిసి గాంధీ మంగళవారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. అయిదేండ్ల పాటు ప్రజల కోసం పని చేసినట్లు, తన కోసం పోలింగ్ రోజున ఓటర్లు అండగా నిలవాలని కోరారు. నియోజకవర్గ అవసరాలకు అనుగుణంగా రూ.9 వేల కోట్లను వెచ్చించి విస్తృతమైన అభివృద్ధి పనులను చేపట్టినట్లు, రాబోయే రోజులలో మరిన్ని అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తానని విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.